హైదరాబాద్, ఏప్రిల్ 19:
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, వడదెబ్బ (Heatstroke) ప్రమాదం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

తీవ్రమైన వడదెబ్బ లక్షణాలు
వాంతులు, తలనొప్పి, అధిక చెమట, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు:

  • మధ్యాహ్న 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదు

  • ఎక్కువగా నీళ్లు తాగాలి

  • పండ్ల రసాలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి

  • పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

అధికారిక సమాచారం ప్రకారం, వడదెబ్బకు గురికావడం వల్ల ఇప్పటికే రెండు మరణాలు నమోదయ్యాయని తెలిసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here